ములుగు జిల్లా లోని దేవాదుల ప్రాజెక్ట్ సందర్శించిన పొంగులేటి శీనన్న, సహచర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారులు 2026 లోగ ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేసే విధంగా ప్రణాళిక

Number of Views:840

GOLCONDA NEWS | Updated:2024-01-02 15:22:05 IST

మణిపూర్ లో మళ్లీ వాయిలెన్స్ : 4గురు దుర్మరణం

మణిపూర్ లో మళ్లీ హింసకు తాండవం చేస్తుంది. కొత్త సంవత్సరం మొట్టమొదటి రోజే ఒక గ్రూప్ జరిపిన కాల్పుల్లో 4 గురు దుర్మరణం చెందారు. వీళ్లతో పాటు చాలా మంది గాయపడ్డారు. తౌబాల్ జిల్లాలోని లిలాంగ్‌లో ఈ ఘటన జరిగింది. దాడికి పాల్పడ్డ దుండగుల వాహనాలకు స్థానికులు నిప్పు పెట్టడంతో అక్కడ హింస చెలరేగింది. దీంతో రాష్ట్రంలోని ఐదు లోయ జిల్లాల్లో మళ్లా కర్ఫ్యూను విధించాల్సి వచ్చింది. తౌబాల్, ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, కక్చింగ్, బిష్ణుపూర్ జిల్లాల్లో కర్ఫ్యూను పెట్టినట్లు అధికారులు తెలిపారు. కొందరు వ్యక్తులు ఆటోమేటిక్ ఆయుధాలతో కాల్పలు జరిపారని, దోపిడీ కోసం వచ్చి ఈ దారుణానికి తెగబడ్డారని స్థానికులు చెబుతున్నారు. దుండగుల సమూహం ఓ స్థానిక వ్యక్తితో మాట్లాడుతుండగా వారి మధ్య గొడవ జరిగిందని, కొద్దిసేపటికి అందరిపై కాల్పులు జరిపారని ఓ వ్యక్తి వెల్లడించారు.
ఈ హింసాత్మక ఘటనపై మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ స్పందించారు. హింసాత్మక ఘటనను ఆయన ఖండించారు. శాంతిని కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఆయన వీడియో మెసేజ్ ను కూడా విడుదల చేశారు. అమాయక ప్రజల ప్రాణాలు తీయడం పట్ల విచారం వ్యక్తం చేశారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయన్నారు. నేరస్థులను గుర్తించేందుకు స్థానికులే మేలు చేయగలరని.. వారంతా ప్రభుత్వానికి సహాయం చేయాలంటూ లిలాంగ్ ప్రజలను ఆయన కోరారు.
ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో పరిస్థితులు మెరుగవుతున్న టైమ్ లో జరిగిన ఈ హింసాత్మక ఘటనపై మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం బీరెన్ సింగ్ ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేశారు. గతేడాది మే 3న మణిపూర్‌లో చెలరేగిన హింస 2023లో జరిగిన ముఖ్య ఘటనల్లో ఒకటిగా నిలిచిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో చోటుచేసుకున్న తీవ్ర హింసలో 180 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, సుమారు 60,000 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. మణిపూర్ మంటలు ఇంకా ఎప్పుడు చల్లారుతాయో అర్థం కాని పరిస్థితి అయితే నెలకొంది.

        Subscribe our Youtube channel
Add Your Comment
No Comments
Recent గా మీరు చదివినవి
Last visit:2025-10-07 03:00:30 IST
రాహుల్ ఈ సారి బస్ యాత్ర share
Last visit:2025-10-07 03:00:30 IST
మణిపూర్ లో మళ్లీ వాయిలెన్స్ : 4గురు దుర్మరణం share
Last visit:2025-10-07 03:00:30 IST
అయోధ్య రామయ్యకు భారీ విరాళం ప్రకటించిన ముకేశ్ అంబానీ share
Last visit:2025-10-07 03:00:30 IST
కేరళలో ఓనమ్ కోలాహలం share
Last visit:2025-10-07 03:00:29 IST
ట్రావెల్ బస్ బోల్తా: ఇద్దరు మ్రుతి, 55 మందికి గాయాలు share
Last visit:2025-10-07 03:00:29 IST
తాట తీస్తా..: నిర్మాత దిల్ రాజ్ ఫైర్ share
Last visit:2025-10-07 03:00:29 IST
మన సర్వపిండిని మెచ్చుకున్న మధ్యప్రదేశ్ మాజీ సీఎం share
Last visit:2025-10-07 03:00:29 IST
రాహుల్ యాత్ర కు మణిపూర్ నో పర్మిషన్ share
Last visit:2025-10-07 03:00:29 IST
గుంటూరు కారం గురించి పబ్లిక్ టాక్ ఏంటంటే.. share
Last visit:2025-10-07 03:00:29 IST
అక్కడ భూమే లేదు.. కోటికి పైగా వసూలు చేసిండ్రు share
WhatsApp

Warning: Undefined array key "sub" in /home/u558784287/domains/golcondanews.com/public_html/news.php on line 2498