ములుగు జిల్లా లోని దేవాదుల ప్రాజెక్ట్ సందర్శించిన పొంగులేటి శీనన్న, సహచర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారులు 2026 లోగ ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేసే విధంగా ప్రణాళిక

Number of Views:860

GOLCONDA NEWS | Updated:2024-01-22 23:17:40 IST

బీజేపీ స్త్రీ వ్యతిరేక పార్టీ.. సీతామాత గురించి మాట్లాడదు: మమతా బెనర్జీ

అయోధ్యలో బాల రాముడి ప్రాణప్రతిష్ట నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీజేపీ స్త్రీ వ్యతిరేక పార్టీ మండిపడ్డారు. సోమవారం మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడారు. బీజేపీ పార్టీ ఎప్పుడు రాముడి గురించే మాట్లాడుతుందని.. సీత గురించి ఎక్కడా ప్రస్తావించదని తెలిపారు. దీంతో బీజేపీ పార్టీ ఓ స్త్రీ వ్యతిరేక పార్టీ అని అర్థం చేసుకోవచ్చని దుయ్యబట్టారు. అయోధ్య రామ మందిరంలోని రాముడి ప్రాణప్రతిష్ట జరిగిన రోజే మమతా బీజేపీపై మాటల దాడి చేశారు.
‘బీజేపీ వాళ్లు రాముడి గురించే మాట్లాడుతారు. సీతాదేవి గురించి ఎందుకు మాట్లాడరు? వనవాసం సమయంలో కూడా సీతాదేవి రాముడి వెంటే ఉంది. కానీ, బీజేపీ వాళ్లు సీతా దేవి గురించి ఏమాత్రం ప్రస్తావించరు. దీంతో వాళ్లు ఎంతటి స్త్రీ వ్యతిరేకులో తెలుసుకోవచ్చు. తాను దుర్గా మాతను పూజిస్తాను. ఇలాంటి వాళ్లు(బీజేపీ) భక్తి, మతం గురించి ఉపన్యాసాలు ఇవ్వటం సరికాదు’ అని మమతా బెనర్జీ మండిపడ్డారు.
తాను ఎన్నికల కోసం మతాన్ని రాజకీయం చేయటాన్ని నమ్మనని తెలిపారు. మత రాజకీయలు ఎప్పుడు చేయనని అన్నారు. అలా చేయటానికి చాలా వ్యతిరేకినని చెప్పారు. రాముడిపై భక్తి, విశ్వాసం కలిగి ఉండటంపై తానను ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. కానీ, ప్రజల ఆహార అలవాట్లపై జోక్యం చేయటాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తానని అన్నారు. ఇక.. మమతా బెనర్జీ అయోధ్య బాల రాముడి ప్రాణప్రతిష్టకు హాజరు కాలేదన్న విషయం తెలిసిందే.

        Subscribe our Youtube channel
Add Your Comment
No Comments
Recent గా మీరు చదివినవి
Last visit:2025-10-07 01:26:10 IST
నేడు మోడీ యూపీ పర్యటన share
Last visit:2025-10-07 01:26:10 IST
బీజేపీ స్త్రీ వ్యతిరేక పార్టీ.. సీతామాత గురించి మాట్లాడదు: మమతా బెనర్జీ share
Last visit:2025-10-07 01:26:09 IST
సిరీస్ మనదే.. share
Last visit:2025-10-07 01:26:09 IST
సాహసం చేయరా ఢింబకా share
Last visit:2025-10-07 01:26:09 IST
ప్రజాపాలనకు సోనియా గాంధీ దరఖాస్తు: సోషల్ మీడియాలో చక్కర్లు share
Last visit:2025-10-07 01:26:09 IST
మా సమ్మయ్య కు పద్మ శ్రీ: జనగామ జిల్లా వాసుల సంబురం share
Last visit:2025-10-07 01:26:08 IST
పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం కావాలి... share
Last visit:2025-10-07 01:26:08 IST
ఏపీలో గ్రామ వలంటీర్లు నేటి నుంచి సమ్మె share
Last visit:2025-10-07 01:26:08 IST
వణుకుతున్న తెలంగాణ share
Last visit:2025-10-07 01:26:08 IST
కాళేశ్వరం కట్టడం వెనక రాజకీయ కోణమే : నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి share
WhatsApp

Warning: Undefined array key "sub" in /home/u558784287/domains/golcondanews.com/public_html/news.php on line 2498