ములుగు జిల్లా లోని దేవాదుల ప్రాజెక్ట్ సందర్శించిన పొంగులేటి శీనన్న, సహచర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారులు 2026 లోగ ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేసే విధంగా ప్రణాళిక

Number of Views:925

GOLCONDA NEWS | Updated:2024-01-08 21:51:45 IST

ఈటలకు, నాకు మధ్య గ్యాప్ లేదు: బండి సంజయ్

  • అప్పులు.. హామీలు ఎట్లా తీరుస్తరు..?

  • కాంగ్రెస్ కు సూటి ప్రశ్న

  • బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్

ఈటల రాజేందర్ తో తనకు ఎలాంటి గొడవల్లేవని.. అందరితో కలిసి మెలిసి ఉంటానని.. అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంది పార్టీని వీడి వెళ్లినా ఈటల రాజేందర్ మోదీ విధానాలను, పార్టీ సిద్ధాంతాలను నమ్మి పార్టీలో కొనసాగుతున్నారు... వారి ఆలోచనలను పార్టీ పరిగణలోకి తీసుకుంటుందని ఎంపీ బండి సంజయ్ అన్నారు. తాము కలిసి మెలిసి పనిచేసి.. అత్యధిక ఎంపీ సీట్లు సాధిస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన బండి సంజయ్ సోమవారం తనను కలిసిన మీడియాతో మాట్లాడారు. అప్పుల పాలైన తెలంగాణను రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా గట్టెక్కుస్తుందో, ఇచ్చిన హామీలన్నీ ఎట్లా అమలు చేస్తుందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు చెప్పాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. పైసా ఖర్చు లేని హామీలు సైతం ఎన్నికల్లో ఇచ్చారని, వాటిని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి నెల రోజులు దాటినా.. హామీల అమలుపై ప్రజల్లో గందరగోళం నెలకొందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వద్ద ఉన్న ప్లాన్ ఏమిటి? వాటిని ఎట్లా అమలు చేస్తారో ప్రజలకు వివరించాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల వరకు నాన్చి గట్టెక్కాలనుకుంటున్నట్లు కన్పిస్తోందన్నారు. లేని పక్షంలో ప్రజలు కాంగ్రెస్ ను విశ్వసించరన్నారు.
ఖర్చులేని హామీలేమయ్యాయి..?
ఎన్నికల్లో పైసా డబ్బుల్లేకుండా అమలు చేసే అవకాశాలున్న హామీలు చాలా ఉన్నాయని.. వాటిని ఎందుకు అమలు చేయడం లేదు? ఉదాహరణకు 317 జీవోను సవరణ.. ఎందుకు అమలు చేయడం లేదన్నారు. డ్రగ్స్ కేసు.. ఇంటర్ విద్యార్థుల జీవితాలతో ఆడుుకున్న గ్లోబరినా కేసు.. టీఎస్ పీఎస్సీ లీకేజీ కేసులు ఎటు పోయాయని బండి నిలదీశారు. అధికారంలోకి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై సీబీఐ విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారని.. ఈ విషయాన్ని ప్రస్తావించిన కిషన్ రెడ్డిపై ఎందుకు మందలా మాటల దాడి చేస్తున్నారన్నారు. నయీం ఎన్ కౌంటర్ సమయంలో అక్రమాస్తుల డాక్యుమెంట్లు లారీల కొద్దీ ఉన్నాయని, పెద్ద ఎత్తున డబ్బులు స్వాధీనం చేసుకున్నామని పోలీసులే వెల్లడించారు.. ఈ కేసు విచారణ ఏమైందని అన్నారు. వీటన్నింటికి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఉందన్నారు. లేకుంటే ప్రజల విశ్వాసం కాంగ్రెస్ కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.
బీజేపీ వర్సెస్ కాంగ్రెస్
పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీకి మధ్య జరిగేవని.. బీఆర్ఎస్ కు ఓటేస్తే డ్రేనేజీలో వేసినట్లేనని అన్నారు. తెలంగాణ నుండి ఎక్కువ మంది బీజేపీ ఎంపీలను గెలపించాలని.. గతంలో బీఆర్ఎస్ ను గెలిపిస్తే... కేంద్రంతో సఖ్యత లేకుండా నిధులను దారి మళ్లించిన బీఆర్ఎస్ రాష్ట్రానికి అన్యాయం చేసిందనే వాస్తవాన్ని ప్రజలు గమనించారన్నారు. ఇపుడు తెలంగాణ ప్రజలంతా బీజేపీవైపు మొగ్గు చూపుతున్నారన్నారు. బీజేపీ ఎంపీలను గెలిపిస్తే కేంద్రాన్ని ఒప్పించి మెప్పించి నిధులు తీసుకొచ్చి.. తెలంగాణను సమగ్రాభివ్రుద్ధి చేస్తామన్నారు.

        Subscribe our Youtube channel
Add Your Comment
No Comments
WhatsApp

Warning: Undefined array key "sub" in /home/u558784287/domains/golcondanews.com/public_html/news.php on line 2498