ములుగు జిల్లా లోని దేవాదుల ప్రాజెక్ట్ సందర్శించిన పొంగులేటి శీనన్న, సహచర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారులు 2026 లోగ ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేసే విధంగా ప్రణాళిక

Number of Views:1673

GOLCONDA NEWS | Updated:2024-01-24 16:59:24 IST

కటకటాల్లోకి కబ్జాకోరులు

- ఊచలు లెక్కపెడుతున్న కరీంనగర్ కార్పొరేటర్లు
- పోలీసుల తీరుపై అభినందనలు వెల్లువ


కరీంనగర్ లో కార్పొరేటర్ల పై పోలీసుల వేట మొదలైంది. నిన్న బీఆర్ఎస్ కార్పోరేటర్ తోటరాములను అరెస్టు చేయగా.. ఈ రోజు మరో కార్పోరేటర్ జంగిల్ సాగర్ పై వేటు పడింది. కరీంనగర్లో కబ్జాలకు అడ్డాగా మారిన లీడర్లను ఒక్కొక్కరిని పోలీసులు కటకటాలకు పంపుతున్నారు. అమాయకులైన పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్లు ఇల్లు కట్టుకోవాలని గుంట జాగ కొనుక్కోవాలన్న భయంతో వణికి పోయే రోజులివి. వాళ్ల కనుసన్నల్లో.. అనుకున్నంత డబ్బు ముట్ట చెపితేనే వదిలిపెడతారు. లేదంటే రాత్రికి రాత్రే కట్టిన ఇండ్లను కూల్చివేస్తారు. కొనుక్కున్న ప్లాట్లలో రాత్రికి రాత్రే పునాదులు లేపి గోడలు కూడా కడతారు.

ఇంతటి దౌర్జన్యాలు అక్రమాలకు పాల్పడ్డ కబ్జాకోరుల ఆగడాలు టిఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు సాగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొట్టమొదటిసారిగా చేసిన పని భూ కబ్జాకోరులపై వేట. ఇప్పటికే మంత్రి పొన్న ప్రభాకర్ ఆర్టీఏ కార్యాలయం దగ్గరి పార్కు పేరు చొక్కారావు పార్కుగా మార్చారు. కేసీఆర్ పేరిట ఉన్న గెస్ట్ హౌజ్ పేరును సైతం తొలగించారు. ఇలా నాడు బీఆర్ ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు ఇష్టారీతిగా చేసిన పనులను.. ప్రజలు ఇప్పుడు ఆమోదించడం లేదు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం వాటిపై ఉక్కుపాదం మోపుతుంది.

రేకుర్తి ప్రాంతంలో అనేక ప్రభుత్వ భూములను కబ్జా చేసి తన కుటుంబ సభ్యులు బంధువులు పేర్ల మీద రాయించుకుని అసలైన లబ్ధిదారులకు ఎన్నో ఇబ్బందులకు గురిచేసిన కార్పొరేటర్ జంగిలి సాగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. తోట రాములు, జంగిలి సాగర్ తో పాటు కరీంనగర్ శివారు గ్రామాల్లో భూ కబ్జాలకు పాల్పడి ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తున్న బయటకు రాని నాయకులను సైతం విచారణ చేపట్టి జైళ్లకు తరలించాలని కరీంనగర్ ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు. కరీంనగర్ నగరంలో రాజకీయ అండదండలతో కబ్జాకోరులుగా మారి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న అందరిని కటకటాలకు పంపించాలని ప్రజలు కోరుతున్నారు.

        Subscribe our Youtube channel
Add Your Comment
 KARNE NARESH 2024-01-24
చాలా చక్కగా చేస్తున్నారు..... ఈ ప్రభుత్వవానికి.... 👍💯
 19         
 చందు 2024-01-24
పార్టీలకు అతీతంగా పరిపాలన జరగాలి వీళ్ళు మనవాళ్ళు వాళ్ళు వేరే పార్టీ వారు అని కాకుండా తప్పు చేసిన వారు శిక్ష అనుభవించేలా చేస్తే పార్టీకి నాయకులకు ప్రజల్లో గుర్తింపు లభిస్తుంది
 12         
 చందు 2024-01-24
Good job
 2         
 నారాయణ 2024-01-24
కరీంనగర్ లో ప్రజలు వీళ్ల వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. వీళ్లకు సరైన మొగుడు వచ్చాడు. సామాన్యులకు మంచి టైమ్ వచ్చింది. పోలీసులు గ్రేట్.. జై కాంగ్రెస్
 28         
క్రైమ్ నుండి మరిన్ని వార్తలు
Updated:2024-02-23
రోడ్డు ప్రమాదంలో యువ ఎమ్మెల్యే దుర్మరణం
Updated:2024-02-10
అక్కడ భూమే లేదు.. కోటికి పైగా వసూలు చేసిండ్రు
Updated:2024-02-06
గంగుల అనుచరుడు శ్రీపతి అరెస్టు
Updated:2024-02-02
భూకబ్జాలకు పాల్పడిన మాజీ ఎంపీటీసీ అరెస్టు
Updated:2024-01-31
బ్రాండ్ రైస్ పేరిట మోసాలు
Updated:2024-01-10
పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ ప్రెస్ : 6గురికి గాయాలు
Updated:2024-01-08
ఇరిగేషన్ ఆఫీస్ లో కంప్యూటర్లు మాయం
Updated:2024-01-05
జాతీయ స్థాయిలో పోలీస్ స్టేషన్ కు గుర్తింపు
Updated:2024-01-04
యువతి పై కత్తితో దాడి: ప్రేమ వ్యవహారమే కారణమా..?
Updated:2023-12-30
రోడ్డు ప్రమాదంలో 5 గురి దుర్మరణం
Updated:2023-12-30
ట్రావెల్ బస్ బోల్తా: ఇద్దరు మ్రుతి, 55 మందికి గాయాలు
Updated:2023-12-26
మాజీ ప్రియుడిపై ప్రియురాలు కుట్ర
WhatsApp

Warning: Undefined array key "sub" in /home/u558784287/domains/golcondanews.com/public_html/news.php on line 2498